ఎయిర్‌పోర్టులో స్క్రీన్‌ కేంద్రాన్ని పరిశీలించిన ఈటెల

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి హైదరాబాద్‌ వస్తున్న వారిని స్క్రీన్‌ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈ కేంద్రాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా వైరస్‌ లేదు. విదేశాల నుంచి వచ్చే వారి ద్వారానే వ్యాధి వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు కరోనా వైరస్‌ ప్రభావం ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరినీ ధర్మోస్క్రీన్‌ చేస్తున్నామని అధికారులు మంత్రికి వివరించారు.